Saturday, March 17, 2012

తెలుగు వారికి ఇంగ్లీషు తెగులు


తెలుగు రాష్ర్ట్రంలో తెలుగు మాటాడ్డం నేరమా..? దేష భాషలందు తెలుగు లెస్స, తేనెలొలుకు తెలుగు అన్న పెద్దల మాటలు అంతగా చేదెక్కాయా..?   
ఆంధ్రప్రదేష్ లో తెలుగు భాష తీరు తెన్నులు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది ఇటీవల  విషఖపట్నంలోని ఒక పాఠశాలలో నాలుగో తరగతి పాప తెలుగులో సమాధానం చెప్పిందని వాతలు పడేలా  కొట్టాడు ఓ ప్రిన్సిపల్. మాతృ    భాషను అవమానించడమంటే కన్నతల్లిని అవమానించినట్లే. ఇలాంటి వారివల్లే అమ్మా,  నాన్నా పదాల స్థానంలో మమ్మీ డాడీలు  చేరాయి. ఇప్పుడు తల్లి దండ్రుల ధోరని కూడా    ఇలాగే ఉంది. తమ పిల్లలు ఇంగ్లీష్ నే    తిని, ఇంగ్లీష్ నే తాగి, ఇంగ్లీష్ లోనే ఆలోచించాలన్నట్టుగా ఉంది.  ఇంగీష్  లో మాట్లాడారంటే   మహా ఘనకార్యం  సాధించినంత  సంభరపడిపోతున్నారు. చందమామ రావే, జాబిల్లి రావే అని పాడుతూ పాపాయిలకు గోరు ముద్దలు తినిపించే తల్లులు మచ్చుకైనా కనిపించడం లేదు. ఇప్పటి పిల్లలకు ఇంగ్లీష్  రైం స్ తప్ప తెలుగు పాటలంటేనే తెలియని పరిస్థితి. నేటి ఆధునిక యుగంలో తెలుగు మీడియంలో చదివే వారంటే చిన్న చూపు, తెలుగు మాట్లాడాలంటే చిన్నతనం. అసలు ఇంగ్లిష్ తెలియక పోతే  మనిషే వృధా   అన్నట్లుగా  తయారైంది    పరిస్థితి. అధికారుల దగ్గర నుంచి ప్రజల దాకా అందరూ   తెలుగు భాషను నిర్లక్ల్ష్యం చేస్తూనే ఉన్నారు. అన్నె కార్యాలయాల్లోనూ తెలుగులోనే వుత్తర ప్రత్యుత్తరాలు నడపాల్సి ఉన్నా అది ఎవరూ పాటించడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాస్ట్ర రాజధానితో పాటు రాస్ట్రంలోని    ఏ మూల చూసినా సగానికి పైగా ప్రభుత్వ, ప్రైవేటు   కార్యాలయాలతో పాటు హూటల్లు, దుకానాల బోర్డులన్ని ఇంగ్లీష్  లోనే కనిపిస్తాయి. ఒక వేల తెలుగులో  ఉన్నా అచ్చు    తప్పుల్లేని రాతలే కనిపించడం లేదు. దాదాపు చాలా మంది డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు కూడా స్పష్టంగా తెలుగులో రాయలేని వాల్లున్నారంటే  అతిశయోక్తి     కాదు. తెలుగు భాష గొప్పతనాన్ని గుర్తించి తెలుగులో  రాయడం, మాట్లాడ్డం నేర్చుకుని తెలుగు కోసం పాటుపదిన సిపి  బ్రౌన్ వటి విదేశీయులను   చూసైనా మనవాళ్ళు  బుద్ది తెచ్చుకోవాలి. పరభాషా   వ్యామోహంలో పది మనం కూర్చున్న కొమ్మను   మనమే నరుక్కుంటున్నామన్న సంగతి గుర్తించలేకున్నారు తెలుగు వారు.  ఏ దేశ మేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భరతిని అన్న పెద్దల మాటల్ని పెడచెవిన  పెడితే తెలుగుకు వెలుగుల సంగతేమో కానీ భవిష్యత్ అంధకారమయం కావడం తథ్యం.. తెలుగు భాష విషయంలో    తెలుగు భాషా సంఘం కూడా  పూర్తి స్థాయిలో ఈమి చేలలేని పరిస్థితులేమిటో  కూడా అర్థం కావడం లేదు. తెలుగు భాషా సంఘానికి తలపండిన మేథావులు అధ్యక్షత వహించినా కూడా పరిస్థితులు మెరుగుపడక పోవడం బాధాకరం.  ఇప్పటికైనా  రాజకీయ నాయకులు, అధికారులు కళ్ళు తెరిచి తెలుగు భషను బతికించుకోవడానికి పూనుకోకుంటే  మన ఉనికి నాశనానికి మనమే కారకులమౌతాం. ఇదే జరిగితే.. మనల్ని భవిష్యత్ తరాలు  ఎన్నటికీ క్షమించవు.     


నవ కలం పేరుతో మార్చ్ 15- 2012న న్యూస్9 దినపత్రికలో అచ్చయినది.