ప్రజా సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు, ఆనందాల కేరింతలను పాత్రికేయలు రాస్తే, అచ్చేసే వాటిని వార్తా పత్రికలు అంటారు. కానీ.. సొంతలాభానికి, సొంతగోడును ‘అచ్చోసి’ వదిలేవి కరపత్రాలు అవుతాయి గానీ వార్తపత్రికలు ఎలా అవుతాయి..? వారివారి బాధలన్నింటినీ జర్నలిజం బాధలుగా గగ్గోలు చేయడం మహా విడ్డూరం. ఆంధ్రప్రదేశ్లో అస్సలు వార్తాపత్రికలనేవి ఉన్నాయా..? ఉంటేగింటే ఆస్థాన పత్రికలు లేదా కరపత్రికలు మాత్రమే కనబడుతున్నాయి. పత్రికల పగ్గాలు పాత్రికేయుల చేతిలోనుంచి వ్యాపారుల, రాజకీయనేతల చేతుల్లోకి వెళ్ళాయో ఆనాడే దాదాపు గా అసలుసిసలైన మీడియా కనుమరుగైందనే చెప్పాలి. పెట్టుబడిదారులు నడిపే పత్రికల్లో పనిచేస్తున్నవారిని పనివాళ్ళుగానే చూస్తున్నారుగానీ పాత్రికేయులుగా చూడ్డం లేదు. ప్రపంచీకరణ, అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీ నేపథ్యంలో అన్నిరంగాల్లోనూ మార్పులు వచ్చినట్టే జర్నలిజంలోనూ మార్పులు వచ్చాయి. ప్రాణాలకు తెగించి పరిశోధనాత్మక వార్తలు, కథనాలు రాసే జర్నలిస్టులు మచ్చుకైనా కనిపించడంలేదు. పెట్టుబడిదారులు నడుపుతున్న పత్రికల్లో పనిచేస్తున్న పాత్రికేయులకు భావాలున్నా, ప్రజల పక్షాన రాయాలన్న తపన ఉన్నా ఇవేవీ చేయలేని పరిస్థితి. సహజంగానే వ్యాపారస్తుడు తన లాభం చూసుకుంటాడే కానీ.. ఎవరికో సాయం చేయాలన్న తలంపుతో తానెప్పుడూ నష్టపోవాలనుకోడు. తన బాధనే ప్రజల, పాత్రికేయుల బాధగా చూపాలనుకుంటాడు. గతంలో ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికమీద దాడి జరిగినప్పుడు ఎలా జరిగిందో.. ప్రస్తుతం సాక్షి మీడియా సంస్థ మీద దాడుల నేపథ్యంలో కూడా అదే జరుగుతోంది. గతంలోనూ, ఇప్పుడే కాదు.. ఇకమీదట కూడా అదేజరుగుతూనే ఉంటుంది. నిజానికి పాత్రికేయులు వారి సొంత సమస్యలమీద ఏనాడు ఇంతగా పోరాడలేదు. నిరసనలు తెలపనూలేదు. దేశమందరి బాధలు రాసే పాత్రికేయులు వారి సమస్యలను పరిష్కరించే చేసేవారికోసం ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి చెప్పుకుంటే పరువు పోతుంది.. లేకుంటే ప్రాణంపోతుంది అన్నట్లుంది పాత్రికేయుల దుస్థితి. నేటికాలంలో జర్నలిస్టులు రాస్తున్న రాతలు కానీ, చేస్తున్న ఆందోళనలు గానీ స్వతహా వాళ్ళ మెదళ్ళు చెప్పినట్లు చేస్తున్నవి కాదు. వారంతా రాయబడుతున్నారు, చేయబడుతున్నారు. జర్నలిజం, పాలిటిక్స్ పాలూ నీళ్ళలా కలగలిసిపోయాయి. నేడు ఏది రాజకీయమో ఏది జర్నలిజమో పోల్చుకోవడం అంత తేలిక కాదు. రాజకీయ నాయకుల కష్టాలు మీడియా కష్టాలవుతున్నాయి. వారి స్వేచ్ఛే మీడియా స్వేచ్ఛగా మారిపోయింది. ఒక చిన్న ఉదాహరణ.. ఒకానొక సమయంలో ఒక పాత్రికేయుని ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పేరుతో ఇంటికి పిలిచి తన్నిపంపాడు.. బావిలో కప్పలాగా డెస్క్లో ఉండే ఒక సబ్-ఎడిటర్ ఆ వార్తను టాబ్లాయిడ్లో కలర్పేజీలో పెట్టాడు. అది చూసిన ఆ పత్రిక ఎడిటర్ ఈ వార్తను ఎవరు పెట్టమన్నారయ్యా..? తీసెయ్ అని ఆర్డర్.. అదేంటి తన్నులు తిన్నది మన విలేకరే కదా సార్ అని సబ్-ఎడిటర్ సమాధానం ఇవ్వగా... నిజమే తన్నిందికూడా మన పార్టీ ఎమ్మెల్యేనే లేవయ్యా చెప్పింది విని ఆ వార్తను తీసెయ్. అన్నారు ఎడిటర్గారు. ఇదీ పరిస్థితి. రౌడీలు, గూండాలే రాజకీయనాయకులు కాగలుగుతున్నారు. ఇలాంటి వారే పత్రికాధిపతులుగా ఉన్న సమాజంలో పత్రికా స్వేచ్ఛ, పాత్రికేయుల హక్కులు ఉంటాయనుకోవడమంత మూర్ఖత్వం మరోటి ఉండదు. ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో పత్రికను నడుపుతుంటే అవి ఆస్థానపత్రికలవుతాయి గానీ.. వార్తాపత్రికలు ఎలా అవుతాయి..? పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు వారి సమస్యలు, హక్కుల కోసం యజమానులతో పోరాడతున్నారుగానీ, పాత్రికేయుల్లో ఆ మాత్రం కూడా పోరాట పటిమ కనిపించదు. తమ యజమానులకు జ్వరమొస్తే పాత్రికేయులు వణికిపోవడం, వారికి కష్టనష్టాలు ఎదురైతే వీరు రోడ్లక్కెడం షరా మామూలైపోయింది. చాపకింద నీరులా రిలయన్స్ అధినేతలవంటి దిగ్గజాలు మీడియా రంగాన్ని ఆక్రమించేస్తున్నారు. మీడియా పరిస్థితి ఇప్పుడే ఇంత దారుణంగా ఉంటే.. భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందో ఊహించుకోవడానికే భయంకరంగానూ, అసహ్యంగానూ ఉంటుంది.
Friday, May 18, 2012
కరపత్రికా పోరాటం..!
ప్రజా సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు, ఆనందాల కేరింతలను పాత్రికేయలు రాస్తే, అచ్చేసే వాటిని వార్తా పత్రికలు అంటారు. కానీ.. సొంతలాభానికి, సొంతగోడును ‘అచ్చోసి’ వదిలేవి కరపత్రాలు అవుతాయి గానీ వార్తపత్రికలు ఎలా అవుతాయి..? వారివారి బాధలన్నింటినీ జర్నలిజం బాధలుగా గగ్గోలు చేయడం మహా విడ్డూరం. ఆంధ్రప్రదేశ్లో అస్సలు వార్తాపత్రికలనేవి ఉన్నాయా..? ఉంటేగింటే ఆస్థాన పత్రికలు లేదా కరపత్రికలు మాత్రమే కనబడుతున్నాయి. పత్రికల పగ్గాలు పాత్రికేయుల చేతిలోనుంచి వ్యాపారుల, రాజకీయనేతల చేతుల్లోకి వెళ్ళాయో ఆనాడే దాదాపు గా అసలుసిసలైన మీడియా కనుమరుగైందనే చెప్పాలి. పెట్టుబడిదారులు నడిపే పత్రికల్లో పనిచేస్తున్నవారిని పనివాళ్ళుగానే చూస్తున్నారుగానీ పాత్రికేయులుగా చూడ్డం లేదు. ప్రపంచీకరణ, అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీ నేపథ్యంలో అన్నిరంగాల్లోనూ మార్పులు వచ్చినట్టే జర్నలిజంలోనూ మార్పులు వచ్చాయి. ప్రాణాలకు తెగించి పరిశోధనాత్మక వార్తలు, కథనాలు రాసే జర్నలిస్టులు మచ్చుకైనా కనిపించడంలేదు. పెట్టుబడిదారులు నడుపుతున్న పత్రికల్లో పనిచేస్తున్న పాత్రికేయులకు భావాలున్నా, ప్రజల పక్షాన రాయాలన్న తపన ఉన్నా ఇవేవీ చేయలేని పరిస్థితి. సహజంగానే వ్యాపారస్తుడు తన లాభం చూసుకుంటాడే కానీ.. ఎవరికో సాయం చేయాలన్న తలంపుతో తానెప్పుడూ నష్టపోవాలనుకోడు. తన బాధనే ప్రజల, పాత్రికేయుల బాధగా చూపాలనుకుంటాడు. గతంలో ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికమీద దాడి జరిగినప్పుడు ఎలా జరిగిందో.. ప్రస్తుతం సాక్షి మీడియా సంస్థ మీద దాడుల నేపథ్యంలో కూడా అదే జరుగుతోంది. గతంలోనూ, ఇప్పుడే కాదు.. ఇకమీదట కూడా అదేజరుగుతూనే ఉంటుంది. నిజానికి పాత్రికేయులు వారి సొంత సమస్యలమీద ఏనాడు ఇంతగా పోరాడలేదు. నిరసనలు తెలపనూలేదు. దేశమందరి బాధలు రాసే పాత్రికేయులు వారి సమస్యలను పరిష్కరించే చేసేవారికోసం ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి చెప్పుకుంటే పరువు పోతుంది.. లేకుంటే ప్రాణంపోతుంది అన్నట్లుంది పాత్రికేయుల దుస్థితి. నేటికాలంలో జర్నలిస్టులు రాస్తున్న రాతలు కానీ, చేస్తున్న ఆందోళనలు గానీ స్వతహా వాళ్ళ మెదళ్ళు చెప్పినట్లు చేస్తున్నవి కాదు. వారంతా రాయబడుతున్నారు, చేయబడుతున్నారు. జర్నలిజం, పాలిటిక్స్ పాలూ నీళ్ళలా కలగలిసిపోయాయి. నేడు ఏది రాజకీయమో ఏది జర్నలిజమో పోల్చుకోవడం అంత తేలిక కాదు. రాజకీయ నాయకుల కష్టాలు మీడియా కష్టాలవుతున్నాయి. వారి స్వేచ్ఛే మీడియా స్వేచ్ఛగా మారిపోయింది. ఒక చిన్న ఉదాహరణ.. ఒకానొక సమయంలో ఒక పాత్రికేయుని ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పేరుతో ఇంటికి పిలిచి తన్నిపంపాడు.. బావిలో కప్పలాగా డెస్క్లో ఉండే ఒక సబ్-ఎడిటర్ ఆ వార్తను టాబ్లాయిడ్లో కలర్పేజీలో పెట్టాడు. అది చూసిన ఆ పత్రిక ఎడిటర్ ఈ వార్తను ఎవరు పెట్టమన్నారయ్యా..? తీసెయ్ అని ఆర్డర్.. అదేంటి తన్నులు తిన్నది మన విలేకరే కదా సార్ అని సబ్-ఎడిటర్ సమాధానం ఇవ్వగా... నిజమే తన్నిందికూడా మన పార్టీ ఎమ్మెల్యేనే లేవయ్యా చెప్పింది విని ఆ వార్తను తీసెయ్. అన్నారు ఎడిటర్గారు. ఇదీ పరిస్థితి. రౌడీలు, గూండాలే రాజకీయనాయకులు కాగలుగుతున్నారు. ఇలాంటి వారే పత్రికాధిపతులుగా ఉన్న సమాజంలో పత్రికా స్వేచ్ఛ, పాత్రికేయుల హక్కులు ఉంటాయనుకోవడమంత మూర్ఖత్వం మరోటి ఉండదు. ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో పత్రికను నడుపుతుంటే అవి ఆస్థానపత్రికలవుతాయి గానీ.. వార్తాపత్రికలు ఎలా అవుతాయి..? పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు వారి సమస్యలు, హక్కుల కోసం యజమానులతో పోరాడతున్నారుగానీ, పాత్రికేయుల్లో ఆ మాత్రం కూడా పోరాట పటిమ కనిపించదు. తమ యజమానులకు జ్వరమొస్తే పాత్రికేయులు వణికిపోవడం, వారికి కష్టనష్టాలు ఎదురైతే వీరు రోడ్లక్కెడం షరా మామూలైపోయింది. చాపకింద నీరులా రిలయన్స్ అధినేతలవంటి దిగ్గజాలు మీడియా రంగాన్ని ఆక్రమించేస్తున్నారు. మీడియా పరిస్థితి ఇప్పుడే ఇంత దారుణంగా ఉంటే.. భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందో ఊహించుకోవడానికే భయంకరంగానూ, అసహ్యంగానూ ఉంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment